ట్రంప్‌ కీలక నిర్ణయం...చైనాపై తీవ్ర పరిణామాలు

National

views 16

Apr 20th,2020

అగ్రరాజ్యం అమెరికాలో నిన్న ఒక్కరోజే 1939 మంది ప్రాణాలు కోల్పోగా కరోనా బాధితుల సంఖ్య 7 లక్షల 92 వేలు దాటింది. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో 42,514 మంది మృతి చెందారు.ఈ సంధర్బంలో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నమని ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నట్లు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

కరోనా గుట్టు విప్పేందుకు తమ దర్యాప్తు బృందాన్ని వుహాన్‌కు పంపాలనుకుంటున్నామని ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  చైనాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా లో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలనుకుంటున్నాం కానీ చైనా మమ్మల్ని అనుమతించడంలేదు' అని తెలిపారు.కరోనా వ్యాప్తిపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు తేలితే చైనాపై తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన అ ట్రంప్‌ తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...