ఏప్రిల్ 5 న మోడీ సూచనలు.... 9 గంటల 9 నిమిషాలు...మొబైల్ ఫ్లాష్ లేదా కొవ్వొత్తి వెలిగించాలి

కరోనాపై యుద్ధం చేస్తున్న విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మన భారత దేశం నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ప్రతీ ఒక్కరు ఇంట్లో ఉంటే కరోనా వైరస్ ని జయించినట్లే అని ఐక్యంగా పోరాడితే కరోనాపై గెలుస్తామని అన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. ఏప్రిల్ 5 న అందరూ కరోనా చీకట్లు తరిమివేయాలని అందరూ రాత్రి 9 గంటల 9 నిమిషాలకు లైట్లు ఆపివేయాలని భారతీయులు అంతా ఏకమై కరోనా వైరస్ ని తరిమికొట్టాలని కరోనాపై యుద్ధం ఇంకా కొనసాగించాలని, ఇంకా పోరాడితేనే తరిమి కొట్టే అవకాశం ఉంటుందని అన్నారు. లైట్లు ఆపేసి ప్రజలు అందరూ దీపాలు వెలిగించాలని మోడీ సూచించారు. లైట్స్ ఆపేసి టార్చి లైట్ మొబైల్ ఫ్లాష్ లేదా కొవ్వొత్తి వెలిగించాలని
దేశ ప్రజలు సంకల్ప శక్తిని వెలిగించాలని ఆయన సూచించారు. 9 నిమిషాల పాటు అందరూ లైట్స్ ఆపేయాలని ఏప్రిల్ 5 న చేసే కార్యక్రమంలో అందరూ సామాజిక దూరం పాటించాలని ఈ 9 నిమిషాలు తనకు ఇవ్వాలని, కరోనాపై ఇంకా పోరాడాల్సిన అవసరం ఉందని130 కోట్ల మంది సంకల్ప శక్తిని చాటాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
Comments
Post Your Comment
Public Comments: