పాపం 16 బాలికకు మద్యం తాగించి లైంగికదాడి....

National

views 19

Jun 16th,2020

ఒకవైపు కరోనతో దేశం అల్లడి పోతుంటే దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన 16 ఏండ్ల బాలిక ఢిల్లీ ప్రాంతంలోని ఓ ఇంట్లో పనిమనిషిగా ఉన్నది. శుక్రవారం సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌కు ఒంటరిగా చేరుకున్న ఆ బాలికను గమనించిన కొందరు ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమె వెళ్లాల్సిన రైలు ఎక్కిస్తామని నమ్మింఛి ఆ బాలికను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోగా మత్తులో రోడ్డు పక్కన ఉన్న బాలికను పోలీసులు గమనించారు. కోత్వాలి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి మహిళా పోలీసుల చేత ఆరాతీయించగా ఈ విషయం తెలిసింది. ఆమెకు హాస్పిటల్ కి తీసుకెళ్ళి చికిత్స అందించిన అనంతరం చిన్నారుల సంక్షేమ సంఘానికి అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...