గంగ ప్రక్షాళన జరిగింది అలా... పీహెచ్ 8.5% గాను 7.4 %

National

views 19

Apr 20th,2020

కరోనా వైరస్ గంగను ప్రక్షాళన చేసింది. లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమవ్వడంతో పాటు పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర రసాయనాలు, వ్యర్థాలు భక్తుల రాక కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గంగానది నీళ్లు కళ్లకద్దుకుని తాగేంత పరిశుభ్రంగా మారడమే కాకుండా నది లోపల ఉండే చేపలు స్పష్టంగా కనిపిస్తున్నాయీ. హరిద్వార్ వద్ద గంగా నది నీటి పీహెచ్ శాతం అదుపులోకి వచ్చిందని ఇక్కడి నీటి పీహెచ్ శాతం 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. ప్రస్తుతం గంగా నదీ జలాల పీహెచ్ శాతం 7.4 గా ఉందనీ నీటిని పర్యావరణ విభాగం 'క్లాస్ ఏ' విభాగంలో చేర్చినట్లు పర్యావరణ విభాగం పేర్కొంది. గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రిషికేష్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల వద్ద గంగానది ఉండటం అక్కడకు లక్షలలో వచ్చే భక్తులు ఇష్టానుసారంగా వ్యర్ధాలు పడేయడం, ఇక గంగానది వెంట ఆనుకోని ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర రసాయనాలు, వ్యర్థాలు నదిలో కలిపేయడంతో గంగానది విషపూరితంగా మారింది.ఇప్పటికైనా ప్రక్షాళన అయిన గంగ నదిని కాపాడుకుంటారో లేక గాలికి వదిలేస్తారా చూడాలి

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...