వైద్య సదుపాయాల్ని మెరుగుపరిచేందుకు రూ.15 వేల కోట్ల నిధులు

National

views 5

Mar 24th,2020

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాల  వైద్య సదుపాయాల్ని మెరుగుపర్చుకునేందుకు రూ.15 వేల కోట్ల నిధులు సమకూరుస్తున్నామనా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లు ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయని కొనియాడారు.కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని మోదీ అన్నారు. 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...